రూ.4 వేల పెన్షన్ పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇస్తామని తెలిపారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు.