మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్మెన్ రంగన్న మృతిపై సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రంగన్న మృతిపై అనుమానాలు రావడంతో సిట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కోసం మరో మారు రీ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పులివెందులలో రంగన్న మృతదేహానికి శనివారం నలుగురు వైద్యుల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించి మరిన్ని నమూనాలను సేకరించనున్నారు.