లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పెద్దార్ రోడ్డులోని పోలింగ్ బూత్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నేను, నా కుటుంబంతో కలిసి మా ఓటు వేశాము. ఇది ప్రతి భారతీయుడికి చాలా గర్వకారణం’ అని పేర్కొన్నారు.