సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ ఇందిరానగర్ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉదయం 11. 30 నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు. 11కేవీ సచివాలయం ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అం తరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.