నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

70பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా బుధవారం పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డిఇ రామకృష్ణ తెలిపారు. 11కేవీ శారదానగర్ ఫీడర్ పరిధి కాలనీల్లో ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 వరకు, 11కేవీ పోస్టాఫీసు ఫీడర్ కింది కాలనీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి చింతి స్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.