వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జనువుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వనస్థలిపురం ఏసీపీ పల్లే కాశిరెడ్డి అన్నారు. వనస్థలిపురం సబ్ డివిజన్ వరిధిలో ఏర్పాటు చేయబోయే గణేశ్ మండపాల నిర్వాహకులు, కార్పొరేటర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.