అత్యంత ప్రమాదకరమైన 33 కేవీ విద్యుత్ లైన్ తీగలు తెగి కిందపడటంతో స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తారు. మన్సూరాబాద్లోని సహారా- కామినేని హాస్పిటల్ ప్రధాన రోడ్డు ఆయిల్ మిల్ వద్ద 33 కేవీ విద్యుత్ తీగలు సోమవారం తెగి కిందపడిపోయాయి. బాగా రద్దీగా ఉండే ప్రదేశమైన విద్యుత్ తీగలు తెగిన సమయంలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. 15 రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని స్థానికులు భయాందోళనలో ఉన్నారు.