అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ప్రధాని మోదీ ఖాతా తెరిచారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ట్రంప్తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 'ట్రూత్ సోషల్'లో చేరడం సంతోషంగా ఉందన్న మోదీ.. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు తాను వేచి చూస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో మోదీ మాట్లాడిన వీడియోను ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశారు.