ఈనెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి.
16 రోజులపాటు పార్లమెంటు ఉభయ సభలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు లోక్సభ ముందుకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.