LRSకు ఆశించిన స్పందన ఉందని, గడువు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే తమ ప్రభుత్వానికి లేదని లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ‘అక్రమ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేసిన సబ్రిజిస్ట్రార్లు సస్పెండ్ అవుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి. భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్దరిస్తాం. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయి’ అని చెప్పారు.