టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

64பார்த்தது
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో శనివారం వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా తాము మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, ఉమాకాంత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி