చక్రేశ్వర శివాలయంలో వినాయక ప్రతిమ ప్రాణ ప్రతిష్ట

54பார்த்தது
చక్రేశ్వర శివాలయంలో వినాయక ప్రతిమ ప్రాణ ప్రతిష్ట
వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమ ప్రాణప్రతిష్టను శనివారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వినాయకున్ని పూలు, పండ్లు, పత్రాలతో, ధూప దీప నైవేద్యాలు, మంగళహారతులతో పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహరాజ్, అర్చకులు మహేష్ పాఠక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி