బోధన్ పట్టణంలో వీరశైవ సమాజం తరఫున బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర దేశాయ్ మాట్లాడుతూ శ్రావణమాస ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న లింగ దీక్ష మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వీరశైవ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.