కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

60பார்த்தது
కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి
సాలురా మండలం హున్సా గ్రామానికి చెందిన సంజీవ్ తన కుమారుడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సాలురా వైపు వస్తున్న క్రమంలో కారు ఢీకొనగా సంజీవ్(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మచ్చందర్ తెలిపారు. ఆయన కుమారుడు అనీల్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி