చిన్నారులతో పని చేయిస్తే కఠిన చర్యలు

66பார்த்தது
చిన్నారులతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలు శాఖల అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా మంగళవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పలు దుకాణాలలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, లేబర్ డిపార్ట్మెంట్, సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాలలో పనిచేస్తున్న చిన్నపిల్లలను పట్టుకొని కౌన్సిలింగ్ చేశారు. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పనిచేస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி