రెగ్యులర్ ఎంఈఓల నియామక క్రియను చేపట్టాలి

82பார்த்தது
రెగ్యులర్ ఎంఈఓల నియామక క్రియను చేపట్టాలి
ప్రతి మండలంలో విద్యావ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రెగ్యులర్ ఎంఈఓల నియామక ప్రక్రియను చేపట్టాలని బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ కోరారు. సోమవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ చాలా మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేదన్నారు. ప్రస్తుతం చాలా మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే ఉన్నారని. ఒక్కో ఎంఈఓకు రెండు మూడు మండలాల బాధ్యతలు అప్పగించారన్నారు. ఇన్చార్జి ఎంఈఓలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన వాపోయారు.

தொடர்புடைய செய்தி