ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

51பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ మండల సిఐ సైదారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే పండుగలు, తదితర అంశాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పండుగలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. అలాగే గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி