నష్టపోతున్నాం ఆదుకోండి

84பார்த்தது
నష్టపోతున్నాం ఆదుకోండి
ఖానాపూర్ నియోజకవర్గంలోని గోదావరి నది, వివిధ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలలో పంటలు వేసే తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ గోదావరి నది, వివిధ ప్రాజెక్టుల ఆయకట్టులు ఉన్నాయి. భారీ వర్షాలతో గత మూడు సంవత్సరాలుగా పరివాహక ప్రాంతాలలో తాము వేసే పంటలకు నష్టం వాటిల్లుతోందని, వరదలు వచ్చినప్పుడు భూమి కోతకు గురి కావడంతో వ్యవసాయానికి పనికి రావడం లేదని వారు వాపోయారు.

தொடர்புடைய செய்தி