ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మబ్బులు ఉన్న ఎండ తీవ్రత కొనసాగింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు 39 డిగ్రీల పగటి గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. రాబోయే నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుండి 42 డిగ్రీల మధ్య నమోదయి ఎండ తీవ్రత ఉంటుందన్నారు. మధ్యాహ్నం వేళలో ప్రజలు బయటకు వెళ్ళవద్దని వారు కోరారు.