తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్గా నిరంజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న, వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. బీసీ కమిషన్పై ఎవరికి ఎలాంటి అపోహాలు అవసరం లేదన్నారు. బీసీ కులగణన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. బీసీ కులగణన జరగాలంటే అన్ని బీసీల సంఘాల సహకారం అవసరమని పేర్కొన్నారు.