ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు చేపూరి రవీందర్ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డు వెంకటేశ్వర కాలనీలో సోమవారం చేపూరి రవీందర్ సహకారంతో ఆయుష్మాన్ భారత్ నమోదు క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు రావుల వెంకన్న, నడికుడి నవీన్ కుమార్, సంగిశెట్టి నరసింహ, గంజి తులసి దాస్ ఎండి గౌస్ పాల్గొన్నారు.