ప్రజాసేవకు రాజకీయాల్లో వచ్చా - ఏనుగుల రాకేష్ రెడ్డి

160520பார்த்தது
ప్రజాసేవకు రాజకీయాల్లో వచ్చా  - ఏనుగుల రాకేష్ రెడ్డి
🔹ప్రజాసేవ కోసం, ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో, రాజకీయాల్లో మార్పు తేవాలని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు మీకోసం చట్టసభలో కోట్లాడే అవకాశం మొదటి సారి లభించనుంది.

🔹సామాన్య కుటుంబం నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చిన నాకు పేదింటి కష్టాలు బాగా తెలుసు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అన్ని రంగాల్లోని పట్టభద్రుల సమస్యల పట్ల నాకు స్పష్టమైన అవగాహనతో పాటు, పరిష్కరించాలన్న తపన ఉంది.

🔹కాబట్టి, మీలో ఒకడిగా, మీ అందరి ప్రతినిధిగా మీ గళమై ప్రశ్నించడానికి, శాసనమండలిలో మీ హక్కుల కోసం కొట్లాడటానికి, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పైన మీ అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.

🔹ఎంతో ఆలోచించి మీరు వేసే ఓటు వృధా కాకుండా చట్టసభల్లో మీ గౌరవాన్ని పెంచడానికి ప్రతిక్షణం కృషి చేస్తాను.

మీ ఏనుగుల రాకేష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి

தொடர்புடைய செய்தி