నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో నగదు పట్టుబడింది. సోమవారం వాహన తనిఖీలు చేస్తుండగా కొండమల్లేపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 1, 20, 000 రూపాయల నగదును సీజ్ చేసినట్లు ఎస్సై రాంమూర్తి తెలిపారు.