హనుమాన్‌ శోభాయాత్రకు స్వాగతం పలికిన ముస్లింలు

71பார்த்தது
హనుమాన్‌ శోభాయాత్రకు స్వాగతం పలికిన ముస్లింలు
హైదరాబాద్‌లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో అద్భుత దృశ్యం కనిపించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుకు చేరుకోగానే స్థానిక ముస్లింలు స్వాగతం పలికారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు మతసామరస్యానికి ప్రతీక అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி