రామాయంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే

79பார்த்தது
రామాయంపేట మండలంలో ఎమ్మెల్యే రోహిత్ రావు బుధవారం పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కోనాపూర్ గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ ను ప్రారంభించి మహిళలకు పుస్తకాలను అందజేశారు. అనంతరం మండలానికి చెందిన 120 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி