కేంద్రమంత్రి బండి సంజయ్ ను కలిసిన టీఎన్జీవో నేతలు

76பார்த்தது
కేంద్రమంత్రి బండి సంజయ్ ను కలిసిన టీఎన్జీవో నేతలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను శనివారం టీఎన్జీవో మంచిర్యాల జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్ రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி