జన్నారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం గణనాథున్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక మార్గం అన్నిటికంటే ముఖ్యమైనదని తెలిపారు. ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూమేష్ ఉన్నారు.