వ్యక్తి అదృశ్యం

82பார்த்தது
వ్యక్తి అదృశ్యం
నెన్నెల మండలంలోని నందులపల్లికి చెందిన సోమిశెట్టి హన్మంతు అదృశ్యమైనట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు మందు స్ప్రే చేసే డబ్బా కొనుగోలు చేసుకొని వస్తానని ఇంట్లో నుంచి రూ. 30 వేలు తీసుకొని వెళ్లాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. భార్య రజిత, కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టు పక్క ఇళ్లల్లో వెతికినా ఆ చూకీ దొరకలేదు. భార్య రజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி