వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి వనపర్తి వెళ్లే రహదారి విస్తరణ పనులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. రోడ్డుపై నుంచి విద్యుత్ స్తంభాలను పక్కకు జరపాల్సి ఉండటంతో విస్తరణ పనులు ఆగిపోయినట్లు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పరిశీలించిన కలక్టర్ విద్యుత్ స్తంభాలు మార్చేందుకు అవసరమైన నిధులు మున్సిపాలిటీ నుంచి సగం ఇవ్వాలని మిగిలిన సగం కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు