రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

82பார்த்தது
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నారాయణపేట పట్టణంలో ఆదివారం మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం వుంటుందని ఏఈ మహమ్మద్ రఫీ శనివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తామని అన్నారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా గణేష్ మార్గం గుండా విద్యుత్ స్తంభాలకు స్విచ్ బోర్డులు బిగింపు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారస్తులు, గృహ వినియోగదారులు సహకరించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி