వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలి: డిఎస్పీ

60பார்த்தது
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలి: డిఎస్పీ
వరుసగా పడుతున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని నారాయణపేట డిఎస్పీ లింగయ్య మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. పురాతన మట్టి మిద్దెలు, గుడిసెలో వున్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పారు. కుంటలు, చెరువులోకి వెళ్లకూడదని అన్నారు. వంతెనలపై నీటి ప్రవాహాన్ని పరిశీలించి దాటాలని సూచించారు. నీటి ప్రవాహ ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడానికి, రీల్స్ చేసేందుకు సహసించరదాని, వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు.

தொடர்புடைய செய்தி