నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో మంగళవారం పి డి ఎస్ యు నాయకులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆహార పదార్థాలు నాణ్యత లేవని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని యూనియన్ జిల్లా కార్యదర్శి అజయ్ అన్నారు. విద్యార్థులకు మంచి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.