విద్యాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

75பார்த்தது
అమరచింత మండల కేంద్రంలో ఆదివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతన అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. మొత్తం 40 లక్షల 50 వేల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி