మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సోమవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతులుగా హాజరయ్యారు. జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు