రూ. కోటి విరాళం ఇచ్చిన ఏపీ జితేందర్ రెడ్డి

65பார்த்தது
ఇటీవల తెలంగాణలో సంభవించిన వరదలు ఎంతో కలచివేశాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. మంత్రి పొంగులేటి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி