లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కురుమూర్తిస్వామి ఆలయ ఈఓ మదనేశ్వర్ రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని లడ్డూ ప్రసాదం విక్రయాలు, తలనీలాల సేకరణకు శనివారం వేలంపాట నిర్వహించారు. లడ్డూ ప్రసాదం రూ. 45. 11 లక్షలకు అరుణ కుమార్(మహబూబ్ నగర్), తలనీలాల సేకరణ గణేష్(అచ్చంపేట) రూ. 25. 15 లక్షలకు దక్కించుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతర వచ్చే నెలలో నెల రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.