పర్యావరణహితం కోసం మట్టి గణపతులనే పూజించాలి: డీఎస్పీ

62பார்த்தது
పర్యావరణహితం కోసం మట్టి గణపతులనే పూజించాలి: డీఎస్పీ
మహబూబ్ నగర్ పట్టణంలోని గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణపతి మండపాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని డీఎస్పీ అన్నారు. నిర్వాహకులు డీఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గిరిజన సేవా సంఘం సీనియర్ సలహాదారు గోవర్ధన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி