త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఎవరు ఆపలేరని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ లో భాగంగా వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా గోపాల్ రెడ్డిని పార్టీ నియమించడంతో శనివారం కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.