వినాయక ఉత్సవాలు శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

82பார்த்தது
వినాయక ఉత్సవాలు శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్
వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం అన్నారు. కలెక్టరేట్ నుండి అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி