వడదెబ్బతో కూలీ మృతి

5791பார்த்தது
వడదెబ్బతో కూలీ మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చమ్మగడ్డ మండలం నుంచి సుమారు 40 మంది వరకు పాల్వంచ మండలం పునుకుల గ్రామంలో జామాయిల్ కర్ర నరికేందుకు డీసీఎం వాహనంలో వచ్చారు. మంగళవారం కర్ర నరుకుతుండగా జర్త నగేశ్ వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరడంతో పాటు, కడుపు ఉబ్బింది. దీంతో అతడిని పాల్వంచలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికేనగేశ్ మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி