తె. జ. స వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను శనివారం జిల్లా ఆదివాసీ జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి మర్యాదపూర్వకంగా కలిశారు. జీవో నెం. 3 పునరుద్ధరణ, ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న పోడు పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన మణుగూరు, పాల్వంచ, మందమర్రిలో జీపీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.