పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి

65பார்த்தது
పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి
భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకి ఆదర్శమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన పలు మండపాలను శనివారం సందర్శించి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ, పాటిస్తూ పండుగలు, ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకొని మానవ సంబంధాలను మెరుగుపర్చాలన్నారు.

தொடர்புடைய செய்தி