కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా

78பார்த்தது
కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల వేతన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. నరాటి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు అమలుచేయడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టాలని చూస్తోందని ఆరోపించారు. కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ కు వినతిపత్రం అందించారు

தொடர்புடைய செய்தி