స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం

66பார்த்தது
స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం
దమ్మపేట మండలం ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని ఆదివాసీ జేఏసీ నాయకులు వీరభద్రం ఆదివారం అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం స్థలంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడిసెలను ఆదివాసి నాయకులు పరిశీలించారు. వెంటనే ఏర్పాటుచేసిన వాటిని తొలగించాలని లేకుంటే, ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி