ఎస్ఐని వేధింపులకు గురి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి

75பார்த்தது
ఎస్ఐని వేధింపులకు గురి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి
అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ను వేధింపులకు గురి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, గిరిజన కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అన్నపురెడ్డిపల్లి అంబేద్కర్ సెంటరులో మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, గిరిజన కులసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కులసంఘాల నాయకులు పుల్లయ్య, శ్రీను, రాంబాబు, రమేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி