భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

63பார்த்தது
భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలోని రాచూర్పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. సోయం జానీ(47) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో ఆదివారం ఓ చర్చి నిర్మాణ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారి కిందకు పడ్డాడు. తీవ్రంగా గాయపడిన జానీని కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తుపల్లికి తరలిస్తుండగా మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி