కాగజ్నగర్ పట్టణంలో ఎస్పీఎం యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆర్ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎస్పీఎం నాయకులతో కలిసి ఆర్ఎస్పీ మాట్లాడుతూ త్వరలో జరగనున్న కార్మీక సంఘాల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన ఎన్నికల బరిలో నిలబడుతుందని అన్నారు. కార్మికులకు అండగా నిలబడుతుందని అన్నారు.