పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని కొమురం భీం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం కాగజ్నగర్ సబ్ డివిజన్ పరిధిలో గల సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ లను ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలన్నారు.