రెండు చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

1893பார்த்தது
రెండు చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొమురంభీం జిల్లాలో అంతరాష్ట్ర మహారాష్ట్ర బోర్డర్ లో ఏర్పాటు చేయబడిన చెక్ పోస్ట్ లలో ఒకటైన కౌటల మండలం తుమ్మిడి హట్టి చెక్ పోస్ట్ ను ఎస్పీ సురేష్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. కాగజ్‌నగర్‌ మైసమ్మ గుడి చెక్ పోస్ట్ ను పరిశీలించి, వాహనాలను తనిఖీ చేసి మాట్లాడారు. 24 గంటలు చెక్ పోస్టులలో తనిఖీ నిర్వహించాలని అన్నారు. కాగజ్‌నగర్‌ డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி