సింగరేణి మండల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

81பார்த்தது
సింగరేణి మండల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
వైరా నియోజకవర్గం సింగరేణి మండల కాంగ్రెస్ నాయకులు గురువారం వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ను, కొత్తగూడెం లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సింగరేణి మండలంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మేదరి టోనీ, పెద్ద బోయిన ఉమాశంకర్, ధారావత్ వినోద్ నాయక్, హనీఫ్, మరసకట్ల రోశయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி